Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కులాంతర ప్రేమ వివాహం... కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు!

కులాంతర ప్రేమ వివాహం... కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు!
, గురువారం, 20 నవంబరు 2014 (18:06 IST)
ఢిల్లీలో వేరే కులానికి చెందిన అబ్బాయిని వివాహం చేసుకుందన్న అక్కసుతో తల్లిదండ్రులు తమ కన్న కుమార్తెను దారుణంగా హత్య చేయడమే కాకుండా గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ విద్యార్థిని ఢిల్లీ వర్శిటీలో విద్యాభ్యాసం చేస్తోంది. కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ప్రతిష్టాత్మక వెంకటేశ్వర కాలేజిలో చదువుతున్న తమ 21 ఏళ్ల కూతురిని కన్న తల్లిదండ్రులే పీక పిసికి చంపేశారు. 
 
ఇందుకు వాళ్ల బంధువు కూడా సహకరించారు. తర్వాత మృతదేహాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లి అక్కడ కప్పెట్టేశారు. దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి, స్థానిక కాంగ్రెస్ కార్యకర్త అయిన జగ్మోహన్, ఆయన భార్య సావిత్రిలను పోలీసులు అరెస్టు చేశారు. 
 
భావన (21) ఈనెల 12వ తేదీన ఆర్యసమాజంలో అభిషేక్ సేఠ్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. అతడు కేబినెట్ సెక్రటేరియట్లో అసిస్టెంట్ ప్రోగ్రామర్గా పనిచేస్తున్నాడు. భావన రాజస్థానీ యాదవ కులానికి చెందినది కాగా, అభిషేక్ పంజాబీ. ఆమెను క్షమించేశామని, పద్ధతిగా పెళ్లి చేస్తామని పిలిపించి మరీ భావనను చంపేశారని పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu