Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబై హీరో ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే భార్య కవిత కర్కరే బ్రెయిన్ డెడ్!

ముంబై హీరో ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే భార్య కవిత కర్కరే బ్రెయిన్ డెడ్!
, మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (12:46 IST)
ముంబై పోలీసు హీరోగా ప్రశంసలు అందుకున్న ఏటీఎస్ చీఫ్ దివంగత హేమంత్ కర్కరే భార్య కవితా కర్కరే సోమవారం మెదడులో ఏర్పడిన రక్తస్రావం కారణంగా మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం తన నివాసంలోనే అపస్మారక స్థితిలో పడిపోయిన ఆమెను కుటుంబ సభ్యులు ముంబైలోని హిందూజా ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆమె మృతి చెందినట్టు వారు అధికారికంగా వెల్లడించారు. 
 
పాకిస్థాన్‌కు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైపై 26/11న దాడికి తెగబడి మారణహోమం సృష్టించిన విషయం తెల్సిందే. తన భర్త మృతి చెందినప్పటికీ నుంచి బాగా కుంగిపోయిన కవిత.. ముంబైలోని ఒక కాలేజీలో అధ్యాపక వృత్తిలో కొనసాగుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో.. గత కొన్ని రోజులుగా మెదడులో రక్తస్రావంతో బాధపడుతూ వచ్చారు. 
 
ఈ పరిస్థితుల్లో సోమవారం ఉదయం తన నివాసంలోనే అపస్మారక స్థితిలో పడిపోయిన కవితను హుటాహుటిన హిందూజా ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు.. బ్రెయిన్ డెడ్ అయినట్టు ప్రకటించారు. కర్కరే దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తన అవయవాలను వైద్య పరిశోధనలకు వినియోగించాలని కవిత కోరినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu