Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా దాకా ఎందుకు...? అలాంటి వారిని మీరే కాల్చి చంపేయండి... హర్యానా డీజీపి సంచలనం

హర్యానా డీజీపి కేపీ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. నేరస్థులను, వేధింపులకు గురిచేసేవారిని సామాన్య మానవులు సైతం చంపేయవచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎవరైనా అమానుషంగా ప్రవర్తిస్తే పోలీసులకు మొరపెట్టుకోడం జర

మా దాకా ఎందుకు...? అలాంటి వారిని మీరే కాల్చి చంపేయండి... హర్యానా డీజీపి సంచలనం
, శుక్రవారం, 27 మే 2016 (19:18 IST)
హర్యానా డీజీపి కేపీ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. నేరస్థులను, వేధింపులకు గురిచేసేవారిని సామాన్య మానవులు సైతం చంపేయవచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎవరైనా అమానుషంగా ప్రవర్తిస్తే పోలీసులకు మొరపెట్టుకోడం జరుగుతుంది. 
 
ఐతే, వేధింపులకు గురి చేసే వారిపై కేసులు, గట్రా ఏమీ లేకుండా, అసలు తమ దాకా వచ్చేకంటే అక్కడే వారిని చంపేస్తే సరిపోతుందని హర్యానా డీజీపి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. తమను తాము కాపాడుకునే క్రమంలో వేధించేవారిని, నేరస్థులను హత్య చేసే హక్కు సామాన్య ప్రజలకు ఉంటుందంటూ ఆయన చెప్పుకొచ్చారు. మరి ఈ వాఖ్యలు ఎంతవరకు వెళతాయో...?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీవీ షోకు ట్రంప్ భారీ డీల్ ఆఫర్.. రూ.67 కోట్లు ఇవ్వండి.. బెర్నీతో డిబేట్‌కు రెడీ!?