Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుజరాత్‌లో భారీ వర్షాలు: 70 మంది మృతి.. రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా

గుజరాత్‌లో భారీ వర్షాలు: 70 మంది మృతి.. రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా
, శుక్రవారం, 26 జూన్ 2015 (13:43 IST)
గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో 70 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలకు ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారింది. అమ్రేలి ప్రాంతంలో ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని, కేవలం ఒక్క ప్రాంతంలోనే 26 మంది మరణించారని చెప్పారు. 
 
మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. ముంపుకు గురవుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. 
 
ఈ వర్షంలో భారీగా పంటలు నష్టపోయాయని, అహ్మదాబాద్‌లో 130 ఎమ్ఎమ్ అత్యధిక వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. జూన్ ఐదో తేదీ నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుజరాత్, అస్సాం ప్రాంతాల్లో భారీ నష్టం ఏర్పడిందని వారు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu