Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజమండ్రిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..పలు రైళ్లు దారి మళ్లింపు..

రాజమండ్రిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..పలు రైళ్లు దారి మళ్లింపు..
, ఆదివారం, 24 మే 2015 (17:49 IST)
ఇటీవల కాలంలో రైళ్ల చక్రాలు పట్టాలపై నిలవడం లేదు. ఎక్కువగా పట్టలు తప్పి ప్రయాణీకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా తూర్పుగోదావరి  జిల్లా రాజమండ్రి సమీపంలో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై గూడ్స్  రైలు పట్టాలు తప్పింది. కాకినాడ నుంచి ఔరంగాబాద్కు వెళ్తున్న గూడ్స్ ఒకటి ఆదివారం రాజమండ్రి -కోవూరు మధ్య పట్టాలు తప్పింది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం  జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 
 
కాగా ఈ రైలు ప్రమాదం కారణంగా అటువైపుగా వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజమండ్రి మీదుగా వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారులు ఆ రైలును పక్కకు తొలగించేందుకు తీవ్ర చర్యలు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu