మోనికా ఘర్డే మర్డర్ కేసు: రెండు కోడిగుడ్లను ఉడికించి తిన్నా.. నగ్నంగా చిత్రీకరించాలనుకున్నా.. కానీ?
ప్రముఖ ఫెర్ఫ్యూమ్ పరిశోధకురాలు మోనికా ఘర్డే మర్డర్ కేసులో రోజుకో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. ఆమెను హత్య చేశానని పోలీసుల విచారణలో అంగీకరించిన సెక్యూరిటీ గార్డు రాజ్ కుమార్ సింగ్ నిజాలను వెల్లడి
ప్రముఖ ఫెర్ఫ్యూమ్ పరిశోధకురాలు మోనికా ఘర్డే మర్డర్ కేసులో రోజుకో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. ఆమెను హత్య చేశానని పోలీసుల విచారణలో అంగీకరించిన సెక్యూరిటీ గార్డు రాజ్ కుమార్ సింగ్ నిజాలను వెల్లడించాడు. ఆమెను బ్లాక్ మెయిల్ చేశానని.. నగ్నంగా చిత్రీకరించాలని అనుకున్నట్లు తెలిపాడు. అయితే మోనికపై అత్యాచారం చేశాడా లేదా అన్న విషయాన్ని తెలుసుకోడానికి పోలీసులు అతడిని ఇంకా ప్రశ్నిస్తున్నారు.
పంజాబ్లోని భటిండాకు చెందిన రాజ్కుమార్ (21) గతంలో సప్నా రాజ్ వ్యాలీలో వాచ్మన్గా పనిచేసేవాడు. అక్కడే మోనిక మృతదేహం లభించింది. ఆమె ఏటీఎం కార్డును ఉపయోగించి బెంగళూరులో డబ్బులు డ్రా చేసినట్లు తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో బెంగళూరులో రాజ్కుమార్ను అరెస్టుచేసి, ట్రాన్సిట్ వారంటు మీద గోవాకు తీసుకొచ్చారు.
ఈ విచారణ సందర్భంగా రాజ్కుమార్ షాకింగ్ నిజాలను బయటపెట్టాడు. దోపిడీ కోసం మౌనిక ఘర్డే ఫ్లాట్లోకి వెళ్లానని ఆమెను కత్తికో బెదిరించానని చెప్పాడు. తర్వాత ఆమె చేతులు కట్టేసి, ఏటీఎం కార్డు తీసుకుని.. పిన్ నెంబరు కూడా బలవంతంగా అడిగి తెలుసుకున్నాడు. తర్వాత ఆమె దుస్తులు విప్పి సెల్ఫోన్లో షూట్ చేయాలనుకున్నానని, ఆ చిత్రం ఆధారంగా తాను ఆమెను బెదిరించాలనుకున్నానని చెప్పాడు.
అయితే నిజంగా అలా షూట్ చేశాడో లేదో మాత్రం ఇంకా తెలియలేదు. మోనిక ముక్కు, నోరు మూసేసి ఊపరిడాకుండా చేసి చంపేసినట్లు వెల్లడించాడు. ఆమె స్పృహ తప్పి వుంటుందని ముందుగా భావించిన అతడు.. వంటగదిలోకి వెళ్లి.. రెండు కోడిగుడ్లు ఉడికించి, వాటిని తిన్నాడు. కానీ ఆమెను తట్టి లేపినా లేవకపోవడంతో.. ఆమె ప్రాణాలు కోల్పోయిందని భావించి అక్కడ నుంచి పరారైనట్లు రాజ్ కుమార్ సింగ్ వెల్లడించాడు.