Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూపీలో 6 గంటల తర్వాత అమ్మాయిలు బయటకువస్తే?!: పారికర్

యూపీలో 6 గంటల తర్వాత అమ్మాయిలు బయటకువస్తే?!: పారికర్
, శుక్రవారం, 25 జులై 2014 (18:13 IST)
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళల భద్రతపై పారికర్ చేసిన వ్యాఖ్యలతో మళ్లీ చిక్కుల్లో పడ్డారు. ‘మా రాష్ట్రం గోవాలో అయితే ఎలాంటి భయం లేకుండా అర్ధరాత్రి కూడా అమ్మాయిలు తిరగొచ్చు.

అదే ఉత్తరప్రదశ్ రాష్ట్రంలో సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత అమ్మాయిలు రోడ్డు మీదకు వస్తే చాలు.. మాయమైపోతారు' అని ఆయన అన్నారు. కొన్ని రాష్ట్రాలు పనిగట్టుకుని గోవా పేరును చెడగొట్టి, తద్వారా గోవాకు వస్తున్న లక్షలాది మంది పర్యాటకులను తమ రాష్ట్రాలు ఆకర్షించేందుకు యత్నిస్తున్నట్లు మనోహర్ పారికర్ ఆరోపించారు. 
 
ఓ పెద్ద న్యూస్ ఛానల్ కూడా పనిగట్టుకుని గోవా పేరును చెడగొట్టేందుకు పనిచేస్తోందని పారికర్ ధ్వజమెత్తారు. వాళ్లకు గోవా మీద ఏవో హక్కులు ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారని, అందుకే అసలా ఛానల్ చూడటమే మానేశానని చెప్పారు. మనం ఏ విషయన్నైనా రెండు రకాలుగా చూడొచ్చని చెప్పిన మనోహర్ పారికర్.. మనం స్వాతంత్ర్య సమరయోధుడిగా చూస్తున్న భగత్ సింగ్, బ్రిటీషు వారికి తీవ్రవాదిలా కనిపించాడని ఉదాహరించారు.

Share this Story:

Follow Webdunia telugu