Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆఫీస్ బాయ్ కాల్పులు... ఇంటర్ విద్యార్థిని మృతి..!

ఆఫీస్ బాయ్ కాల్పులు... ఇంటర్ విద్యార్థిని మృతి..!
, బుధవారం, 1 ఏప్రియల్ 2015 (10:57 IST)
బెంగుళూరులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడి ప్రగతి రెసిడెన్షియల్ కాలేజీలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్న మహేశ్ బుధవారం ఉదయం తుపాకీ చేతబట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇంటర్ విద్యార్థిని గౌతమి(18) సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, ఆమె స్నేహితురాలు శిరీష తీవ్రంగా గాయపడింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన కళాశాలకు చేరుకున్నారు. కాల్పులు జరిపిన వెంటనే మహేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా ఈ ఘటన వెనుక ప్రేమ వ్వవహారమే కారణమని తెలుస్తోంది. తన ప్రేమను తిరస్కరించిన కారణంగానే మహేశ్, గౌతిమిపై కాల్పులు జరిపాడని సమాచారం. 
 
కాల్పుల సమాచారంతో పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనల్లో కూరుకుపోయారు. కాల్పుల ఘటనతో కళాశాల ఆవరణలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Share this Story:

Follow Webdunia telugu