ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. ఓ 14 ఏళ్ళ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. సాధాసీదా అత్యాచారం కాదు. మరో నిర్బయకేసు తలపించే సంఘటనే కావడంతో గుండె పిండేస్తుంది. బాలిక ప్రైవేటు పార్టులో ప్లాస్టిక్, చెక్కముక్కలు, అగ్గిపెట్టె వంటి వాటివి కనుగొన్న డాక్టర్లు దిగ్భ్రమకు గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి.
బిస్కట్లు, స్వీట్లు కొనుగోలు చేయడానికి బయటకు వచ్చిన అమ్మాయిని ముగ్గురు వ్యక్తులు మాయ మాటలు చెప్పి అపహరించుకుపోయారు. మత్తుమందు తాగించి స్పృహ కోల్పోయిన తర్వాత సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నలుగురు వ్యక్తులు ఆమె శరీరంతో ఆడుకున్నారు. మూడు రోజుల పాటు వారి కామక్రీడకు ఆమె శరీరం మైదానంలా మారింది. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.
ఎట్టకేలకు మూడు రోజుల నరకం తర్వాత బంధువుల సాయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఎవరో పిలుస్తున్నారని పక్కింటబ్బాయి చెబితే వెళ్లా. అక్కడ ఇంకో ఇద్దరు ఉన్నారు. అందరూ కలిసి బలవంతంగా ఏదో తాగించి, బంధించి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు అని బాధిత బాలిక తెలిపింది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందనే విషయాన్ని వైద్యులు ధృవీకరించారు.
వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు దిగ్భ్రమకు గురయ్యారు. నిర్భయ గ్యాంగ్ రేప్ తరహాలో అగ్గిపెట్టె, ప్లాస్టిక్, గుడ్డముక్కలు, చిన్న చెక్కముక్కను బాలిక ప్రైవేట్ పార్ట్ పరీక్షల్లో బయటపడ్డాయి. కేసు నమోదుచేసిన పోలీసులు ముగ్గురు నిందితులలో ఇద్దరిని అరెస్ట్ చేశారు.