Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కూల్ డ్రింక్ బాటిల్స్‌లో బీరు కలుపుకుని తాగిన అమ్మాయిలు..! ఎక్కడ?

కూల్ డ్రింక్ బాటిల్స్‌లో బీరు కలుపుకుని తాగిన అమ్మాయిలు..! ఎక్కడ?
, మంగళవారం, 24 నవంబరు 2015 (18:12 IST)
అమ్మాయిలు కూల్ డ్రింక్ బాటిల్స్‌లో బీరు కలుపుకుని తాగితందనాలాడిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కార్పొరేట్ కల్చర్ పేరిట.. మహిళలు మందు కొట్టడం ఫ్యాషనైపోయింది. అయితే పాఠశాలలో చదివే బాలికలు కూడా మద్యం తాగారు. 
 
ఈ ఘటన తమిళనాడులోని నామక్కల్ జిల్లాలోని తిరుచెంగోడ్‌లో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలకు చెందిన నలుగురు బాలికలు తాగితందనాలాడారు. వాళ్లందరూ 11వ తరగతి (జూనియర్ ఇంటర్) చదువుతున్నారు. స్నేహితురాలి పుట్టినరోజును జరుపుకోవాలని ఏడుగురు అమ్మాయిలూ పాఠశాలకు వచ్చారు.
 
ఎవరికీ అనుమానం రాకుండా కూల్ డ్రింక్ బాటిల్స్‌లో బీరు కలుపుకుని తెచ్చుకున్నారు. కానీ వారిలో ముగ్గురు అమ్మాయిలు భయపడి తాగలేదు. మిగతా నలుగురు తాగి అలాగే క్లాస్‌కు వెళ్లిపోయారు. క్లాసులో ఆ అమ్మాయిలు మత్తులో జోగుతుండడాన్ని టీచర్ గమనించారు. 
 
ఈ విషయాన్ని స్కూల్ హెడ్ మాస్టర్‌కు తెలియజేయడంతో ఆ అమ్మాయిలను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే అమ్మాయిలు బీర్ తాగినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్.గోపీదాస్‌ వరకు వెళ్లడంతో మందుకొట్టిన విద్యార్థులకు టీసీలిచ్చి పంపేశారు. 

Share this Story:

Follow Webdunia telugu