Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిక్కుల్లో సదానంద గౌడ : కొడుకు ప్రేయసి మెడలో పసుపుకొమ్ము!

చిక్కుల్లో సదానంద గౌడ : కొడుకు ప్రేయసి మెడలో పసుపుకొమ్ము!
, శుక్రవారం, 29 ఆగస్టు 2014 (11:02 IST)
కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ చిక్కుల్లో పడ్డారు. తన కుమారుడు కార్తీక్ గౌడ చేసిన వెధవ పని కారణంగా ఆయన కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అత్యాచారం చేసి, మోసగించాడంటూ కార్తీక్ గౌడపై కన్నడ వర్ధమాన నటి మైత్రేయ బెంగుళూరు ఆర్.టి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పైపెచ్చు తన మెడలో కార్తీక్ గౌడ కట్టిన పసుపుకొమ్ముతో కూడిన తాడును చూపించింది. దీంతో సదానంద గౌడ పెను వివాదంలో చిక్కుకున్నాడు. 
 
వాస్తవానికి బుధవారం నుంచి గురువారం సాయంత్రం వరకు బోసిమెడతో కనిపించిన మైత్రేయ గురువారం సాయంత్రం మాత్రం హఠాత్తుగా పసుపు కొమ్మును కట్టుకొని కనిపించింది. కార్తీక్ గౌడ్‌పైన ఆర్టీ నగర్ పోలీసు స్టేషన్‌లో మైత్రియ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి లిఖిత పూర్వక ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే ఆమెను అంబేడ్కర్ వైద్య కళాశాలకు తరలించి పరీక్షలను చేయించారు. ఫిర్యాదు నేపథ్యంలో మరింత సమాచారం సేకరించాలని, దీనికోసం గురువారం మధ్యాహ్నం పోలీసు స్టేషన్‌కు రావాలని సంబంధింత అధికారులు ఆమెకు సూచించారు. 
 
ఆమె నుండి ఆధారసహిత సమాచారాన్ని రాబట్టాకే కార్తీక్ గౌడ్‌ను అదుపులోకి తీసుకుంటామని అధికారులు చెప్పారు. కార్తీక్ అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొనలేదన్నారు. వైద్య పరీక్షల నివేదిక వచ్చాక కేసు దర్యాఫ్తును వేగవంతం చేస్తామన్నారు. తాను సదానంద గౌడ కుటుంబం కోడలిగా వెళ్లాలని ఆశిస్తున్నానని మైత్రేయ బెంగళూరులో తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu