Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంట్లో పెళ్ళీడొచ్చిన కుమారులున్నా మహిళతో తండ్రి జల్సా.. హతమార్చిన తనయుడు ఎక్కడ?!

ఇంట్లో పెళ్ళీడొచ్చిన కుమారులున్నారని లెక్కచేయకుండా వివాహేతర సంబంధం పెట్టుకున్న తండ్రిని కన్నబిడ్డే కడతేర్చాడు. ఈ ఘటన తమిళనాడు వేలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వేలూరు జిల్లా, కేవీ కుప్పంకు సమీపంలోని నాగర

ఇంట్లో పెళ్ళీడొచ్చిన కుమారులున్నా మహిళతో తండ్రి జల్సా.. హతమార్చిన తనయుడు ఎక్కడ?!
, శుక్రవారం, 1 జులై 2016 (15:13 IST)
ఇంట్లో పెళ్ళీడొచ్చిన కుమారులున్నారని లెక్కచేయకుండా వివాహేతర సంబంధం పెట్టుకున్న తండ్రిని కన్నబిడ్డే కడతేర్చాడు. ఈ ఘటన తమిళనాడు వేలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వేలూరు జిల్లా, కేవీ కుప్పంకు సమీపంలోని నాగర్ గ్రామానికి చెందిన గోవిందస్వామి (53)కి ఇద్దరు కుమారులున్నారు. ఇతని భార్య కొన్నేళ్ల క్రితం అనారోగ్యం కారణంగా మరణించారు. 
 
తల్లి మరణానికి అనంతరం తనకు వివాహం చేసిపెట్టాల్సిందిగా పెద్దకుమారుడు తన తండ్రిని కోరాడు. అయితే గోవిందస్వామి కుమారులిద్దరినీ పట్టించుకోలేదు. అంతేగాకుండా.. ఓ మహిళతో అతను వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్దకొడుకు తనకు పెళ్ళి చేయకుండా తండ్రి జల్సా చేయడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. 
 
కుమారులను పట్టించుకోకుండా వివాహేతర సంబంధం పెట్టుకున్న తండ్రిని పెద్దకుమారుడే హతమార్చాడు. ఈ ఘటనపై గోవింద స్వామి కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవి మూగజీవాలే.. కానీ, ఒకదాన్ని విడిచి ఒకటి ఉండలేవు.. ఏంటవి..వీడియో!