Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనీ.. ప్రియుడితో కలిసి కొట్టి...

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనీ.. ప్రియుడితో కలిసి కొట్టి...
, శుక్రవారం, 29 ఆగస్టు 2014 (18:14 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో మరో ఘోరం చోటు చేసుకుంది. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే అక్కసుతో తన ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను కొట్టి హత్య చేసింది. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే.. 
 
కాన్పూర్ సమీపంలోని బిధ్ను ప్రాంతానికి చెందిన ప్రేమ్ కుమార్ రాజ్‌పుత్ అనే రైతు భార్య సంగీత ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈయన భార్య స్థానికంగా ఉండే అభిషేక్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరిద్దరు శారీరకంగా ఒక్కటైవున్నపుడు భర్త రాజ్‌పుత్ చూసి హెచ్చరించాడు. అయినప్పటికీ రైతు భార్య తన పద్ధతిని మార్చుకోలేదు కదా, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు ప్లాన్ వేసి ఆ ప్రకారంగా హత్య చేసింది. 
 
ఆ తర్వాత తన భర్త అనారోగ్యంతో మరణించాడంటూ చుట్టుపక్కల ప్రచారం చేసిన సంగీత తన ప్రియుడితో కలిసి భర్త అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది. అయితే, తస్లీంపూర్లో నివసించే మృతుడి సోదరి తన అన్న మృతి గురించి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దాంతో మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపగా, శరీరం మీద గాయాలు కనిపించాయి. తర్వాత ఇంటి గోడలపై రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. దాంతో సంగీతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తన ప్రియుడు అభిషేక్తో వివాహేతర సంబంధానికి నిరాకరించడంతో తామిద్దరం కలిసి భర్తను కొట్టి చంపినట్లు అంగీకరించింది. దీంతో వీరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu