శశికళకు బినామీ తెలుగు పారిశ్రామికవేత్త జీఆర్కే రెడ్డినా?

ఠాగూర్
శుక్రవారం, 19 సెప్టెంబరు 2025 (11:39 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వీకే శశికళకు బినామీగా తెలుగు పారిశ్రామికవేత్త, మార్గ్ గ్రూపు అధినేత జీఆర్కే రెడ్డి (జి.రామకృష్ణారెడ్డి) ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు (ఈడీ) జీఆర్కే రెడ్డికి సంబంధించిన కార్యాలయాలు, గృహాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కెనరా బ్యాంకును రూ.200 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన మనీలాండరింగ్ కేసులో శశికళకు బినామీగా జీఆర్కే రెడ్డి ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్, తిరుపతి, చెన్నై నగరాల్లోని జీఆర్కే రెడ్డి నివాసాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. 
 
హైదరాబాద్ నగరంలోని శామీర్‌పేట, పంజాగుట్ట ప్రాంతాల్లో ఉన్న జీఆర్కే రెడ్డి నివాసాలు, ఆఫీసుల్లో బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి. అదేసమయంలో చెన్నైలోని సైదాపేట, తిరువాన్మియూరు, కోడంబాక్కం సహా మొత్తం ఆరు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఈ తనిఖీల సందర్భంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు, జీఆర్కే రెడ్డి, ఆయన కంపెనీల పేర్ల మీద ఉన్న ఆస్తుల రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకుట్లు సమాచారం.
 
సీబీఐ 2022లో నమోదు చేసిన ఈ కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది. శశికళ బ్యాంకు నుంచి రుణాలు పొంది, ఆ నిధులను జీఆర్కే రెడ్డికి చెందిన సంస్థలకు మళ్లించారని, ఆ డబ్బుతో ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టారని బలమైన ఆరోపణలు ఉన్నాయి. 
 
గతంలో జయలలిత అధికారంలో ఉన్నప్పుడు ఆమె తరఫున హైదరాబాద్‌లో ఆస్తులు కొనుగోలు చేశారని, ఆమె మరణానంతరం శశికళకు బినామీగా వ్యవహరిస్తున్నారనే సమాచారంతోనే ఈడీ ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. మిడ్వెస్ట్ గోల్డ్, మెడ్స్ వంటి సంస్థల్లో జీఆర్కే రెడ్డికి ఉన్న రూ.2,800 కోట్ల విలువైన షేర్ల వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments