Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్లైట్ నడుపుతూ కాక్‌పిట్‌లో సెల్ఫీ ఎందుకు దిగారు.. సంజాయిషీ ఇవ్వండి : డీజీసీఏ

ముగ్గురు పైలట్ల నుంచి భారత వైమానిక భద్రత నియంత్రణ మండలి (డీజీసీఏ) సంజాయిషీ కోరింది. దీనికి కారణం.. ఆ ముగ్గురు పైలట్లు విమానం నడుపుతూ కాక్‌పిట్‌లో సెల్ఫీ దిగడమే ప్రధాన కారణం. ఈ ముగ్గురు ఇండిగో విమాన పై

ఫ్లైట్ నడుపుతూ కాక్‌పిట్‌లో సెల్ఫీ ఎందుకు దిగారు.. సంజాయిషీ ఇవ్వండి : డీజీసీఏ
, శనివారం, 20 ఆగస్టు 2016 (12:06 IST)
ముగ్గురు పైలట్ల నుంచి భారత వైమానిక భద్రత నియంత్రణ మండలి (డీజీసీఏ) సంజాయిషీ కోరింది. దీనికి కారణం.. ఆ ముగ్గురు పైలట్లు విమానం నడుపుతూ కాక్‌పిట్‌లో సెల్ఫీ దిగడమే ప్రధాన కారణం. ఈ ముగ్గురు ఇండిగో విమాన పైలట్లు.
 
విమానంలోని ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో నెడుతూ కాక్‌పిట్‌లో సెల్ఫీలు తీసుకున్న ముగ్గురు పైలెట్లను విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) అధికారికంగా హెచ్చరికలు జారీ చేసింది. విమానం నడుపుతున్నపుడు భద్రతా నిబంధనలను ఉల్లంఘించి కాక్‌పిట్‌లో సెల్ఫీలు దిగటంపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై భద్రతా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని డీజీసీఏ ఆదేశించింది. 
 
కాగా, ఇలాంటి ముప్పును నివారించేందుకు వీలుగా అమెరికా వాణిజ్య విమానాల్లో పైలెట్లు, ఇతర విమాన సిబ్బంది తమ వెంట వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకువెళ్లకుండా అమెరికన్ విమాన భద్రత సంస్థ, ఫెడరల్ ఏవియేషన్ సంస్థలు నిషేధం విధించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎలుకలు చంపేందుకు రూ.4.76 లక్షల సుపారీ ఇచ్చిన రైల్వే అధికారులు!