Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిర్భయ కేసు దోషి ఇంటర్వ్యూను.. చెప్పే వరకు ప్రసారం చేయొద్దు!

నిర్భయ కేసు దోషి ఇంటర్వ్యూను.. చెప్పే వరకు ప్రసారం చేయొద్దు!
, బుధవారం, 4 మార్చి 2015 (18:17 IST)
నిర్భయ కేసు దోషి ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూకు సంబంధించిన వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు రంగంలోకి దిగింది. నిర్భయ కేసు దోషి ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూను తాము ఆదేశించేంత వరకు ప్రసారం చేయవద్దని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ముఖేష్ ఇంటర్వ్యూపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ డాక్యుమెంటరీ ప్రసారం నిలిపివేయాలని పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 
 
దీంతో, తాము చెప్పే వరకు ఏ మీడియా సంస్థ, పత్రికా ప్రచురించకూడదని ఆదేశాలు జారీచేసింది. దీనికి సంబంధించి మరో ఆర్డర్ వచ్చే వరకు ఇదే వర్తిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా, బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ లెస్లీ ఉడ్విన్, బీబీసీ ఛానెల్‌తో కలిసి తీహార్ జైల్లో ముఖేష్‌ను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu