Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేప్‌లు చేస్తే ఆడాళ్లు చేయించుకోవాలి : నిర్భయ కేసు నిందితుడు!

రేప్‌లు చేస్తే ఆడాళ్లు చేయించుకోవాలి : నిర్భయ కేసు నిందితుడు!
, మంగళవారం, 3 మార్చి 2015 (09:27 IST)
ఆడాళ్లు (మహిళలు, యువతులు) రేప్‌లు చేస్తే చేయించుకోవాలని నిర్భయ కేసు నిందితుడు ముఖేష్ సింగ్ అంటున్నాడు. అసలు వాళ్ళకు అర్థరాత్రి పూట ఏం పని ఉంటుందని ఈ ముద్దాయి ప్రశ్నిస్తున్నాడు. 
 
ప్రపంచ మహిళాదినోత్సవం సందర్భంగా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వూలో తాను చేసిన దుర్మార్గంపై పశ్చాత్తాపం లేకుండా మాట్లాడాడు. ఆ వివరాలను పరిశీలిస్తే... అత్యాచారాలకు మగాళ్లనే తప్పుపడుతుంటారు. ఆడవాళ్లకు కూడా అందులో భాగం ఉంటుందనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నాడు. 
 
ఒక చేత్తో చప్పట్లు కొట్టలేమని సూత్రీకరించాడు. అబ్బాయిలు, అమ్మాయిలు పబ్బులు, డిస్కోలకు తిరిగితే పర్లేదా? అని ప్రశ్నించాడు. అబ్బాయిలు, అమ్మాయిలు సమానమైనప్పుడు ఉరిశిక్ష ఎందుకని అడిగాడు. అలా ఉరిశిక్షలు విధిస్తే బాధిత మహిళలకు ప్రాణహాని ఉంటుందని హెచ్చరించాడు 
 
నిర్భయను బలాత్కరిస్తున్నప్పుడు ఆమె మౌనంగా ఉందని, ఎలాంటి ప్రతిఘటనా చేయలేదని అన్నాడు. ఆమెను తామేమీ అనలేదని, ఆమె స్నేహితుడ్ని మాత్రం చితకబాదామని తెలిపారు. నిర్భయపై అత్యాచారం చేసినప్పుడు తాను బస్సు నడుపుతున్నానని ముఖేష్ సింగ్ వివరించాడు. ఆడవాళ్లు ఇళ్లలో ఉంటే అత్యాచారం చేయాలనే ఆలోచన ఎలా వస్తుందని ఎదురు ప్రశ్నించాడు. 

Share this Story:

Follow Webdunia telugu