Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయింది.. జయలలిత మరణం తీరని లోటు... : మోడీ ట్వీట్

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సోమవారం అర్థరాత్రి శాశ్వతనిద్రలోకి జారుకున్నారు. అమ్మ మరణ వార్త వినగానో కోట్లాది మంది తమిళ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. అమ్మ కన్నుమూతపై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం

దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయింది.. జయలలిత మరణం తీరని లోటు... : మోడీ ట్వీట్
, మంగళవారం, 6 డిశెంబరు 2016 (02:31 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సోమవారం అర్థరాత్రి శాశ్వతనిద్రలోకి జారుకున్నారు. అమ్మ మరణ వార్త వినగానో కోట్లాది మంది తమిళ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. అమ్మ కన్నుమూతపై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
 
ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,  లోక్‌సభ స్పీకర్, పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల సీఎంలు, సినీ నటులు సంతాపం తెలిపారు. కాగా, జయలలిత మృతితో తమిళనాడులో మూడు రోజుల పాటు సెలవు ప్రకటించారు. 
 
ప్రజలు, పేదల సంక్షేమానికి ఆమె చేసిన కృషి ఆదర్శనీయమన్నారు. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తి తమిళనాడు ప్రజలకు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోడీ తన సంతాపంలో పేర్కొన్నారు. ఆమె ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూర్చాలని ప్రార్థిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'అమ్మ' ప్రతి అడుగు సంచలనమే... ప్రతి నిర్ణయం విప్లవాత్మకమే... దటీజ్ జయలలిత