Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజస్థాన్ : దళిత బాలలను చితక్కొట్టి నగ్నంగా ఊరేగించారు.. ఎందుకంటే...

రాజస్థాన్ : దళిత బాలలను చితక్కొట్టి నగ్నంగా ఊరేగించారు.. ఎందుకంటే...
, బుధవారం, 6 ఏప్రియల్ 2016 (14:33 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. బైక్ దొంగిలించారన్న కోపంతో ముగ్గురు దళిత బాలలను చితక్కొట్టి నగ్నంగా ఊరేగించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్‌లో 15-18 ఏళ్లలోపు వయసున్న ముగ్గురు దళిత బాలలు ఒక మోటార్‌సైకిల్‌ను అపహరించుకొని దానిపై తమ గ్రామానికి వెళ్తున్న సమయంలో వారిని లక్ష్మీపుర అనే గ్రామంలో స్థానికులు అడ్డుకున్నారు. అనంతరం వారి బట్టలు విప్పి కొట్టి నగ్నంగా ఊరేగించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు తక్షణం అక్కడికి చేరుకొని బాలలను రక్షించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారని జిల్లా ఎస్పీ తెలిపారు. 
 
బైక్‌ను స్వాధీనం చేసుకొని బాలలపై దొంగతనం కేసు నమోదు చేశారని.. అదేసమయంలో వారిమీద దాడి చేసిన వ్యక్తుల్లో ఆరుగురిని అరెస్టు చేసి మిగిలిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. ఈ కేసు కులవివక్ష కారణంగా జరిగింది కాదన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu