Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మనిషి ఆకారంలో లేగదూడ.. చనిపోయినా కళేబరానికి పూజలు.. విష్ణుమూర్తి అంటూ?

గోపూజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గోమాంసం నిషేధానికి సంబంధించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చూసేందుకు మనిషి ముఖంలా కనిపిస్తున్న ఆవుదూడను విష్ణుమ

మనిషి ఆకారంలో లేగదూడ.. చనిపోయినా కళేబరానికి పూజలు.. విష్ణుమూర్తి అంటూ?
, శనివారం, 3 జూన్ 2017 (13:58 IST)
గోపూజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గోమాంసం నిషేధానికి సంబంధించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చూసేందుకు మనిషి ముఖంలా కనిపిస్తున్న ఆవుదూడను విష్ణుమూర్తిగా యూపీ ప్రజలు పూజిస్తున్నారు. అచ్చం మనిషిలా వుండే చెవులు, ముక్కు కళ్లతో ఉన్న దూడకు ఓ ఆవు జన్మనిచ్చింది. ఆ దూడ విష్ణు రూపమని, ఆ దేవుని ఆశీస్సులు తీసుకునేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. 
 
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. అయితే ఆ దూడ మరణించింది. లేగ దూడ కళేబరాన్ని అలానే ఉంచి.. అందుకు దండలు వేసి పూజలు చేస్తున్నారు. మూడు రోజుల్లో మరణించిన దూడకు అంత్యక్రియలు పూర్తి చేస్తామని ఆవు ఓనర్ తెలిపారు. త్వరలో దూడకు ఓ గుడి కూడా కట్టిస్తామని.. చెప్పారు. అయితే ఇవన్నీ మూఢనమ్మకాలని నాస్తికులు కొట్టిపారేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబ్బుకోసం ఏం చేసిందంటే? ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయిల ఫోటోలను?