Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలికపై అత్యాచారం.. హత్య కేసులో బాలుడు అరెస్ట్...!

బాలికపై అత్యాచారం.. హత్య కేసులో బాలుడు అరెస్ట్...!
, గురువారం, 18 డిశెంబరు 2014 (11:48 IST)
తమిళనాడు, వేలూరు జిల్లాలో కేవీ కుప్పంలో బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన కేసులో అదే పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతనికి సాయం అందించిన మరో విద్యార్థి వద్ద విచారణ చేస్తున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు.. వేలూరు జిల్లా కేవీ కుప్పం సమీపంలోని కాంగుప్పం గ్రామానికి చెందిన విజయకుమార్ రెండో కుమార్తె కీర్తిక(11) మాచనూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. సోమవారం సాయంత్రం కీర్తిక పాఠశాల నుంచి తిరిగి ఇంటికి రాలేదు. కీర్తిక మంగళవారం ఉదయం ముళ్ల పొదల్లో మృతదేహంగా కనిపించింది. పోలీసుల విచారణలో ఆమెపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన విషయం తెలిసింది. 
 
పోలీసులు జరిపిన విచారణలో అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్నశరణ్‌రాజ్ ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసింది. దీంతో పోలీసులు అతని వద్ద విచారణ జరుపుగా.. పాఠశాల నుంచి ఒంటరిగా వస్తున్న కీర్తికను తాను ఆట్లాడుకునేందుకు రమ్మని చెప్పి మామిడి తోటలోకి తీసుకువెళ్లి.. కీర్తిక వద్ద ఆటల పేరుతో ఆమె రిబ్బన్‌తోనే ఆమె చేతులు కట్టేసి, ఆమెపై బలవంతంగా అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి పరారైనట్లు అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu