అత్యాచారాలకు పాల్పడుతున్న మృగాళ్ల చేతులు నరికేయండని శ్రీరామసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ అన్నారు. బెంగళూరులో అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్న తరుణంలో ప్రమోద్ ముతాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘అత్యాచారానికి పాల్పడిన వారి చేతులు నరికేయండి. కేసుల్లో ఇరుక్కునే సదరు వ్యక్తుల ఖర్చులు మేమే భరిస్తాం’ అని ముతాలిక్ ఆవేశంతో ఊగిపోయారు. ఇలా చేస్తేనే అత్యాచారాలు తగ్గుముఖం పడతాయని ముతాలిక్ వెల్లడించారు.