చెన్నై టెక్కీ స్వాతి హత్య... నిందితుడి రెండో ఫుటేజ్... తాపీగా నడుచుకుంటూ వెళ్తున్నాడు...ఫోటో
చెన్నై టెక్కీ స్వాతిని హత్య చేసిన నిందితుడి తాలూకు రెండో ఫోటోను చెన్నై పోలీసులు నగరంలో అంతటా సర్క్యులేట్ చేస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు నగరాన్ని జల్లెడ పడుతున్నారు. పట్టపగలే రైల్వే స్టేషనులో యువతిని అత్యంత దారుణంగా హత్య చేసి తాపీగా తప్పించు
చెన్నై టెక్కీ స్వాతిని హత్య చేసిన నిందితుడి తాలూకు రెండో ఫోటోను చెన్నై పోలీసులు నగరంలో అంతటా సర్క్యులేట్ చేస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు నగరాన్ని జల్లెడ పడుతున్నారు. పట్టపగలే రైల్వే స్టేషనులో యువతిని అత్యంత దారుణంగా హత్య చేసి తాపీగా తప్పించుకుని వెళ్లిపోయిన అతడిని పట్టుకోవడమే ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు నగరంలో ప్రతిచోటా నిందితుడి పోస్టర్లను అతికిస్తున్నారు. ఇవాళ అతడికి సంబంధించిన రెండో ఫుటేజిని కూడా విడుదల చేశారు. స్టేషనుకు తాపీగా అతడు నడుచుకుంటూ రావడం ఇందులో కనిపిస్తోంది.
అతడు హత్య చేసిన తర్వాత ఎటు పారిపోయాడన్నదానిపై ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజిలను పరిశీలిస్తున్నారు. నగరంలో ఉన్న అన్ని సిసిటీవీ ఫుటేజిలను తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. ఆదివారం నాడు విడుదల చేసిన ఫుటేజి ప్రకారం అతడు రైల్వే స్టేషనుకు సమీపంలోని గృహ సముదాయాల ద్వారా వెళ్లినట్లు తెలిసింది. దీనితో ఆ ప్రాంతాల్లోని వారిని అతడి గురించి ఏమైనా సమాచారం ఉంటే ఇవ్వమని కోరారు.
మరోవైపు నిందితుడి కోసం పోలీసు బృందాలు ఆయా చోట్ల గాలింపు చర్యలు చేపట్టాయి. అనుమానితుడి గురించి ఏమైనా వివరాలు తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని పోలీసులు వెల్లడించారు. మరోవైపు అతడిని పట్టుకునేందుకు ప్రజలు కూడా సహాయం అందించాలని స్వాతి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.