Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెన్నైలో పట్టపగలు న్యాయవాది హత్య: మా భార్యలను కిడ్నాప్ చేశాడు... అందుకే...

ఇటీవలే మద్రాసు హైకోర్టు న్యాయవాదిని కొందరు రౌడీలు పట్టపగలే నరికి చంపిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయవాదిని చంపిన హంతకులు ఆయ వద్ద రౌడీలుగా ఉన్నవారు కావడం గమనార్హం. న్యాయవాదిని హత్య చేయడానికి వారు చెప్పిన కారణాలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో పట్టపగలు న్యాయవాది హత్య: మా భార్యలను కిడ్నాప్ చేశాడు... అందుకే...
, శనివారం, 25 జూన్ 2016 (18:27 IST)
ఇటీవలే మద్రాసు హైకోర్టు న్యాయవాదిని కొందరు రౌడీలు పట్టపగలే నరికి చంపిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయవాదిని చంపిన హంతకులు ఆయ వద్ద రౌడీలుగా ఉన్నవారు కావడం గమనార్హం. న్యాయవాదిని హత్య చేయడానికి వారు చెప్పిన కారణాలు ఇలా ఉన్నాయి.
 
అతడు తమకు నమ్మకద్రోహం చేశాడు. ఉత్తర చెన్నైలో ఇళ్లు, దుకాణాలను ఖాళీ చేయించడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం, సెటిల్మెంట్లు చేస్తూ డబ్బు గుంజడం, రౌడీల చేతుల్లో చిక్కిన మహిళలను, యువతులను విడిపించి వారిని లొంగదీసుకోవడం, ఖాళీ స్థలాలు కనిపిస్తే కబ్జా చేసి పారేయడం వంటివి న్యాయవాది చేస్తుండేవాడని చెప్పుకొచ్చారు. అంతేకాదు తన చేతికి చిక్కిన యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చేతుస్తుండేవాడని తెలిపారు. 
 
2004లో బేసిన్ బ్రిడ్జి వద్ద జరిగిన ఓ హత్య కేసులో తమను పోలీసులకు ఈ న్యాయవాదే పట్టించినట్లు తమకు ఇటీవలే తెలిసింది. అంతేకాదు తమ వర్గానికి చెందిన నలుగురు వ్యక్తుల భార్యలను కిడ్నాప్ చేశాడు. ఈ ఘటలన్నీ అతడే చేయడంతో ఇక అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నామనీ, ఇందులో భాగంగా మరో రౌడీ ఓలై బాబుతో చేతులు కలిపి పని పూర్తి చేశామని పోలీసులకు నిందితులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొన్న గోల్ఫ్.. నిన్న చెస్.. నేడు ఫుట్‌బాల్.. ఇదీ ఇంగ్లండ్‌లో జగన్ ఆటవిడుపు (ఫోటోలు)