కావేరీ జలాల్ని విడుదల చేయొద్దు సార్.. సిద్ధరామయ్యతో అఖిలపక్ష నేతలు..
తమిళనాడు-కర్ణాటకల మధ్య చోటుచేసుకున్న కావేరీ జలాల వివాదం మరింత ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసేలా కనిపిస్తోంది. కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినప్పటిక
తమిళనాడు-కర్ణాటకల మధ్య చోటుచేసుకున్న కావేరీ జలాల వివాదం మరింత ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసేలా కనిపిస్తోంది. కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కారు అందుకు విరుద్ధంగా నడుచుకోవాలని ప్రయత్నాలు మొదలెట్టింది.
ఇందులో భాగంగా బుధవారం విధాన సౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అఖిలపక్ష నేతలందరూ కావేరీ జలాలను తమిళనాడు విడుదల చేయకూడదని డిమాండ్ చేశారు.
తమిళనాడు మూడు రోజుల పాటు 18వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని మంగళవారం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కర్ణాటక నేతలు సుప్రీం తీర్పును పట్టించుకోలేదు. కావేరి జలాలను విడుదల చేయకూడదన్నారు. ఇక ఈ వ్యవహారంపై బుధవారం జరిగే మంత్రి వర్గ సమావేశంలో సీఎం సిద్ధరామయ్య తుది నిర్ణయం తీసుకుంటారు.