Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భర్తపై కోపాన్ని బిడ్డపై చూపించింది.. సీసీటీవీ కెమెరాలో దొరికిపోయింది.. ఎలా?

నవమాసాలు మోసి కన్న బిడ్డను ఓ తల్లి తరచూ హింసిస్తూ కెమెరాకు దొరికిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లా సుభాష్ నగర్ ప్రాంతానికి చెంది

భర్తపై కోపాన్ని బిడ్డపై చూపించింది.. సీసీటీవీ కెమెరాలో దొరికిపోయింది.. ఎలా?
, శనివారం, 27 ఆగస్టు 2016 (09:38 IST)
నవమాసాలు మోసి కన్న బిడ్డను ఓ తల్లి తరచూ హింసిస్తూ కెమెరాకు దొరికిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లా సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన పూనం అనే మహిళ భర్తపై ఉన్న కోపం తన చిన్నారి కొడుకుపై చూపించింది. కొడుకును దారుణంగా కొడుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో నిక్షిప్తమై వెలుగుచూశాయి.
 
తనపై కోపంతో భార్య పూనం ప్రతిరోజూ కొడుకును కొడుతుండటంతో భర్త దీపక్ చతుర్వేది భార్యకు తెలియకుండా ఇంట్లో సీసీటీవీ కెమేరాలు అమర్చాడు. అందులో పూనం వ్యవహారం ఏంటో తెలిసిపోయింది. భర్త దీపక్ చతుర్వేది ఈ సీసీటీవీ ఫుటేజ్‌ను ఇరుగుపొరుగువారితోపాటు స్థానిక విలేఖరులకు చూపించారు. పూనం నాలుగేళ్ల దాకా బాగానే ఉందని, బిడ్డ పుట్టాక ఏడాదిన్నర కాలం నుంచి ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చిందని భర్త దీపక్ చెప్పారు.
 
సీసీటీవీ ఫుటేజ్ సాయంతో తాను భార్య పూనంకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించి న్యాయం కోసం పోరాడతానని దీపక్ చెప్పారు. కాగా భర్త దీపక్ తనను వరకట్నం తెమ్మని డిమాండు చేస్తున్నాడని భార్య పూనం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శవాన్ని విరిచి.. కొయ్యకు మూటగట్టి తరలించారు... ఒడిశాలో అమానవీయ ప్రవర్తన