Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్నయ్య అశ్లీల సీన్లు చూశాడని బెదిరించింది.. చెల్లెలు వరసైనా అత్యాచారం చేసి హత్య చేసేశాడు..!

అన్నయ్య అశ్లీల సీన్లు చూశాడని చెల్లెలు మందలించింది. అంతే వరుసకు చెల్లెలు అయిన ఆమెను హత్య చేసి అరటి తోటలో పాతిపెట్టాడు. ఈ ఘటన తమిళనాడులోని కోవై జిల్లాలో చోటుచేసుకుంది.

అన్నయ్య అశ్లీల సీన్లు చూశాడని బెదిరించింది.. చెల్లెలు వరసైనా అత్యాచారం చేసి హత్య చేసేశాడు..!
, ఆదివారం, 31 జులై 2016 (09:08 IST)
అన్నయ్య అశ్లీల సీన్లు చూశాడని చెల్లెలు మందలించింది. అంతే వరుసకు చెల్లెలు అయిన ఆమెను హత్య చేసి అరటి తోటలో పాతిపెట్టాడు. ఈ ఘటన తమిళనాడులోని కోవై జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళెయం చెందిన ఫక్రిస్వామి అనే వ్యక్తి కుమార్తె జయశ్రీ (16) గత 22వ తేదీ రాత్రి బయటకు వెళ్ళి ఇంటికి రాలేదు. కంగారు పడ్డ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
పోలీసులు విచారణలో జయశ్రీని చంపింది దినేష్ కుమారేనని తేలింది. దీంతో పోలీసులు అమిదాను అదుపులోకి తీసుకున్నారు. యువతికి అన్నయ్య వరస అయ్యే దినేష్‌ కుమార్‌ అరటి గెలలు కోసే కూలీగా పని చేస్తున్నాడు జయశ్రీని హత్య చేసి అరటి తోపులో పాతిపెట్టినట్టు తెలిపాడు. 
 
ఈనెల 22వ తేదీన అరటి తోటలో మొబైల్‌లో అశ్లీల చిత్రం చూస్తుండగా, బహిర్భూమికి వచ్చిన జయశ్రీ అమ్మానాన్నలకు చెప్తానని బెదిరించిందని.. అందుకే ఆమెపై అత్యాచారానికి పాల్పడి చంపేశానని దినేష్ వెల్లడించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుష్కరాలలో ఉద్యోగులు గోవిందా.. గోవిందా అనాలా...?!