Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెంగళూరులో నిర్భయ ఘటన: 2 గంటలు కారులో తిప్పుతూ.. అపస్మారక స్థితిలో..?

బెంగళూరులో నిర్భయ ఘటన: 2 గంటలు కారులో తిప్పుతూ.. అపస్మారక స్థితిలో..?
, మంగళవారం, 6 అక్టోబరు 2015 (14:09 IST)
ఢిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ ఉదంతాన్ని పోలిన దుర్ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరులోని ఒక బీపీవో కంపెనీలో గ్వాలియర్‌కు చెందిన ఒక యువతి పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా శనివారం రాత్రి బెంగళూరుకు సమీపంలోని హోసూరు మార్గంలో మడివాళ సమీపంలో ఆఫీసు నుంచి తిరిగి వచ్చి.. ఇంటికి వెళ్లేందుకు బస్టాప్‌లో వాహనం కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో క్యాబ్‌ను పోలి ఉండే వాహనం రావటం.. అందులో ఆమె ఎక్కేయడం జరిగిపోయింది. మధ్యలో మరో ఇద్దరు వాహనంలో ఎక్కడం చూసి అనుమానం తలెత్తింది. అంతే అలెర్టయ్యే లోపే జరగాల్సిదంతా జరిగిపోయింది. 
 
మూడేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతాన్ని పోలిన ఈ ఘటన బాధితురాలు అపస్మారక స్థితితో ఉండి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పైశాచికంగా అత్యాచారం చేసిన వైనం వైద్యులు సైతం విభ్రాంతికి గురి అవుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండు గంటల పాటు ఈ నిర్భయ పర్వం కొనసాగివుంటుందని తెలుస్తోంది. కదులుతున్న కారులో బెంగళూరు రోడ్ల వెంట తిప్పుతూ.. ఆమెను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. 
 
అపస్మారక స్థితికి చేరిన ఆ యువతిని.. ఒక గుడి వద్ద పడేసి దుండగులు వెళ్లిపోయారు. ఆ యువతిని గుర్తించిన స్థానిక ఆటో డ్రైవర్లు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆమె అపస్మారక స్థితికి వెళ్ళిపోయింది. 

Share this Story:

Follow Webdunia telugu