Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫోన్ చేసి ఇంటికి పిలిపించి ప్రియుడిని హత్య చేయించిన ప్రియురాలు!

ఫోన్ చేసి ఇంటికి పిలిపించి ప్రియుడిని హత్య చేయించిన ప్రియురాలు!
, బుధవారం, 30 సెప్టెంబరు 2015 (18:31 IST)
ముంబై నగరంలో ఒక ప్రియురాలు దారుణానికి పాల్పడింది. తన ప్రియుడిని కిరాయి రౌడీలతో హత్య చేయించింది. బుధవారం వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... బాంద్రాలోని కార్టర్ రోడ్డులో 21 యేళ్ల యువతి 22 యేళ్ల రిజ్వాన్ ఖాన్ అనే యువకుడిని గత కొంతకాలంగా ప్రేమిస్తోంది. 
 
అయితే, సోమవారం రాత్రి రిజ్వాన్ ఖాన్ పబ్‌కు వెళ్ళాడు. రాత్రి 10 గంటల సమయంలో ప్రేయసి నుంచి ఫోన్ రావడంతో ఆమె ఇంటికి వెళ్లాడు. రాత్రి 11 గంటల సమయం కావడంతో రిజ్వాన్‌ వెంట అతని స్నేహితులు కూడా వచ్చారు. ప్రియుడి కోసం ఇంటి ఆవరణలో వేచి చూస్తున్న ఆమె.. రిజ్వాన్‌ను చూడగానే గొడవపెట్టుకుంది. ఆ సమయంలో మరో ఐదుగురు వ్యక్తులు కూడా ఆమె చెంత ఉన్నారు. కానీ, రిజ్వాన్ స్నేహితులు మాత్రం రోడ్డుపైనే ఉండిపోయారు. 
 
ఆ తర్వాత ఎంతసేపటికి రిజ్వాన్ బయటకు రాలేదు. అదేసమయంలో ఆమె చెంత ఉన్న ఐదుగురు వ్యక్తులు ఇంటి నుంచి బైకుల్లో వెళ్లడంతో వీరికి సందేహం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా, రిజ్వాన్ రక్తపు మడుగులో పడివున్నాడు. రిజ్వాన్‌ను కాపాడుకునేందుకు సమీప ఆప్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేదు. అప్పటికే రిజ్వాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనాస్థలిలో ఒక ఆయుధం లభ్యమైంది. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Share this Story:

Follow Webdunia telugu