Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహారాష్ట్ర : పబ్లిక్ టాయ్‌లెట్‌లో పేలుడు.. బాలుడి మృతి

మహారాష్ట్ర : పబ్లిక్ టాయ్‌లెట్‌లో పేలుడు.. బాలుడి మృతి
, గురువారం, 30 అక్టోబరు 2014 (12:53 IST)
మహారాష్ట్రలో ఓ పబ్లిక్ టాయ్‌లెట్‌లో పేలుడు సంభవించింది. దీంతో ఓ బాలుడు దుర్మరణం పాలయ్యాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు. థానేలోనీ లోకమాన్య నగర్ ఏరియాలో ఈ పేలుడు సంభవించింది. మరణించిన బాలుడిని ఆకాశ్ సింగ్‌గానూ, గాయపడిన వ్యక్తి ఆకాశ్ అంకుల్‌గా గుర్తించారు.
 
ఈ పేలుడుపై థానే పురపాలక సంస్థ అధికారులు స్పందిస్తూ.. సెప్టిక్ ట్యాంకులో ఉత్పత్తి అయిన వాయువులు అధిక పీడనం వద్ద బయటకు వెలువడి ఉంటాయని, అందుకే టాయిలెట్ పేలిపోయి ఉంటుందని చెప్పారు.
 
టాయిలెట్ సీటు సరిగ్గా సెప్టిక్ ట్యాంకుపైనే ఏర్పాటు చేశారని మున్సిపల్ కార్పొరేషన్ రీజనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ చీఫ్ సంతోష్ కదమ్ తెలిపారు. గాయపడిన వ్యక్తిని థానే సివిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు మృతి కింద కేసు నమోదు చేసుకున్న వర్తక్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu