Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహారాష్ట్రలో బీఫ్ తినొచ్చు.. కానీ గోవధ కుదరదు : ముంబై హైకోర్టు

మహారాష్ట్రలో బీఫ్ తినొచ్చు.. కానీ గోవధ కుదరదు : ముంబై హైకోర్టు
, శుక్రవారం, 6 మే 2016 (15:37 IST)
గోడ్డుమాంసం (బీఫ్) భక్షణపై ముంబై హైకోర్టు విచిత్రమైన తీర్పును వెలువరించింది. మహారాష్ట్ర వాసులు ఇతర ప్రాంతాల నుంచి బీఫ్ కొనుగోలు తినొచ్చని పేర్కొంది. అదేసమయంలో మహారాష్ట్రలో మాత్రం గోవధ కదరదని స్పష్టం చేసింది. 
 
గత ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వం బీఫ్ వినియోగంపై పూర్తి స్థాయిలో నిషేధం విధించింది. గో మాంసాన్ని అమ్మినా లేక గోవధ చేసినా చట్ట ప్రకారం నేరంగా పరిగణించింది. ఒకవేళ ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్లకు అయిదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటన చేసింది. 
 
విశ్వనగరమైన ముంబైలో గోమాంస వినియోగంపై నిషేధం సరైంది కాదని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారణకు స్వీకరించిన ముంబై హైకోర్టు.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆవు మాంసాన్ని నిల్వ చేయడం కానీ, తినడం కానీ తప్పుకాదని పేర్కొంటూ తీర్పును వెలువరించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిర్లక్ష్యపు డ్రైవింగ్ కేసులో గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యేకు మూడు నెలల జైలుశిక్ష