Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నల్లధన కుబేరుల లిస్టు వెల్లడిస్తే కాంగ్రెస్ అంతే : అరుణ్ జైట్లీ

నల్లధన కుబేరుల లిస్టు వెల్లడిస్తే కాంగ్రెస్ అంతే : అరుణ్ జైట్లీ
, బుధవారం, 22 అక్టోబరు 2014 (12:09 IST)
భారతీయ సంపదను కొల్లగొట్టి విదేశీ బ్యాంకుల్లో నల్లధనం రూపంలో నిల్వ చేసున్న నల్లధన కుబేరుల జాబితాను బహిర్గతం చేస్తే కాంగ్రెస్ పార్టీ అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఇదే అంశంపై ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ విదేశీ ఖాతాదారుల పేర్లను బయటకు వెల్లడిస్తే కాంగ్రెస్ కచ్చితంగా సమస్య ఎదుర్కొంటుందన్నారు. 
 
నల్లధనం ఖాతాదారుల పేర్లు బహిరంగ పరిస్తే బీజేపీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఈ విషయంపై తాను స్పష్టమైన హామీ ఇస్తున్నట్టు తెలిపారు. కానీ, ఈ ఖాతాదారుల పేర్లను వెల్లడిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఇబ్బంది పడక తప్పదని హెచ్చరించారు. అయితే, సుప్రీంకోర్టు ఆదేశానుసారం.. త్వరలో ఖాతాదారుల పేర్ల వివరాలను షీల్డు కవర్‌లో కోర్టుకు అందజేస్తామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu