Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెంగాల్లో బీజేపీ పాచికలు పారవు : సీఎం మమతా బెనర్జీ!

బెంగాల్లో బీజేపీ పాచికలు పారవు : సీఎం మమతా బెనర్జీ!
, శనివారం, 20 డిశెంబరు 2014 (13:18 IST)
వెస్ట్ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ పాచికలు పారవని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ... దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీ పశ్చిమ బెంగాల్లో తమకు ప్రమాదకరంగా మారుతుందని భావించడం లేదన్నారు. 
 
తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌పై ఎలాంటి సవాలు చేయలేకే తమపై సీబీఐని ప్రయోగిస్తోందని ఆయన ఆరోపించారు. బెంగాల్లో బీజేపీ హవా లేదని, కేవలం మీడియా చేస్తున్న హడావుడేనని అన్నారు. అంతేగాక రాజకీయంగా బీజేపీ తమతో పోటీపడలేదని, సరితూగదని వ్యాఖ్యానించారు. 
 
తమను అవహేళన చేయాలని ప్రయత్నించేందుకే సీబీఐని వాడుతున్నారని అన్నారు. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా తన వద్ద సరైన సాక్ష్యాలున్నాయని, సమయం వచ్చినప్పుడు బయటపెడతానని మమత చెప్పారు. శారదా చిట్ ఫండ్ స్కామ్‌లో తన పాత్ర ఉందని నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆమె ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu