Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దమ్మున్నోడిదే రాజ్యం.. మద్య నిషేధమా తోటకూర కట్టా? మద్యం మత్తులో జేడీయు నేత మాటలు!

బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారు. అయితే, సంపూర్ణ మద్య నిషేధానికి ఆ రాష్ట్ర అధికార పార్టీ జేడీయు నేతలే తూట్ల

దమ్మున్నోడిదే రాజ్యం.. మద్య నిషేధమా తోటకూర కట్టా? మద్యం మత్తులో జేడీయు నేత మాటలు!
, శుక్రవారం, 15 జులై 2016 (12:57 IST)
బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారు. అయితే, సంపూర్ణ మద్య నిషేధానికి ఆ రాష్ట్ర అధికార పార్టీ జేడీయు నేతలే తూట్లు పొడుస్తున్నారు. అంతేనా మద్య నిషేధం అమలుపై కూడా నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఆ వివరాలను పరిశీలిస్తే... 
 
జేడీయు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత లల్లన్ రామ్. ఈయన నోటి దూల కారణంగా పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఈయనగారు మద్యం సేవిస్తూ.. మాట్లాడిన వీడియో టేప్ ఒకటి లీకైంది. అందులో ఎలా మాట్లాడారంటే.. 'దమ్మున్నోడిదే రాజ్యం అన్నాడు. కండలున్నోళ్ళ మద్దతున్నోడి జేబులోనే అధికారులు, ప్రభుత్వం ఉంటాయన్నాడు. తనకు చాలా మంది క్రిమినల్స్ మద్దతు ఇస్తున్నారన్నాడు'. 
 
అంతేకాదండోయ్.. సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉంది.. మద్యం సేవించకూడదు కదా అని పక్కన ఉన్న ఓ వ్యక్తి అంటే.. నిషేధమా తోటకూర కట్టా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చుక్క ఇచ్చిన కిక్కుతో ఆ నేత మనసులో మాటలన్నీ బయటపెట్టి.. పార్టీకి దూరమయ్యాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హలో బాస్.. నీకు అంతుందా...? చూస్తావా అంటూ అది తిని మొదలెట్టాడు... ఏకంగా పైకే పోయాడు...