మద్యం సేవించి పార్లమెంట్కు వచ్చిన భగవత్ మాన్!
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్లోని సింగ్రూర్ ఎంపీ భగవత్ మన్ మద్యం సేవించి తూలుతూ పార్లమెంటుకు హాజరయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా ఈయనపై ఆరోపణలు రావడం ఇదేం మొదటిసారి కాదు గతంలో కూడా ఈ తరహా విమర్
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్లోని సింగ్రూర్ ఎంపీ భగవత్ మన్ మద్యం సేవించి తూలుతూ పార్లమెంటుకు హాజరయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా ఈయనపై ఆరోపణలు రావడం ఇదేం మొదటిసారి కాదు గతంలో కూడా ఈ తరహా విమర్శలు వచ్చాయి. అదే పార్టీకి చెందిన నేత యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ మద్యానికి బానిసగా మారిన మన్... చాలాసార్లు తాగిన మైకంలోనే లోక్ సభలోకి అడుగుపెట్టారని ఆరోపించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి భహిష్కరణకు గురైన యోగేంద్ర యాదవ్ కూడా గతంలో మన్ తీరును తప్పుపట్టారు. లోక్సభ సమావేశాలకు కూడా ఇలాగే తప్పతాగి వెళ్లే వాడని చెప్పారు. తాజాగా పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. మన్ ఫుల్లుగా మందుకొట్టి పార్లమెంటులోకి అడుగుపెట్టారని ప్రజల ప్రతిష్టను మంటగలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.