Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీకి హ్యాట్రిక్ విజయాలు.. సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారు: మోడీ

బీజేపీకి హ్యాట్రిక్ విజయాలు.. సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారు: మోడీ
, మంగళవారం, 25 ఆగస్టు 2015 (15:42 IST)
బెంగళూరు స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపును నమోదు చేసుకోవడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా సంబరాలు జరుపుకున్నారు. బీజేపీని నమ్మి విజయాన్ని కానుకగా అందించిన బెంగళూరు ప్రజలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. 
 
మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బెంగళూరు ఫలితాలు బీజేపీకి హ్యాట్రిక్ గెలుపును అందించాయని మోడీ వ్యాఖ్యానించారు. బెంగళూరు ఎన్నికల ఫలితాలను బట్టి అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని ఆయన అభివర్ణించారు. 
 
కన్నడ ప్రజలకు రుణపడి వుంటానని చెప్పిన ఆయన, కర్ణాటక బీజేపీ నేతలకు, బీబీఎంపీ కార్యకర్తలకు మోడీ అభినందనలు తెలిపారు. బీజేపీపై ప్రజల నమ్మకం ఏమాత్రం తగ్గలేదని మరోసారి రుజువైందని మోడీ వెల్లడించారు. దేశంలోని 125 కోట్ల మంది ప్రజల కోరికలు తీర్చేందుకే తాము ప్రయత్నిస్తామని మోడీ వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu