Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్ లో కాలు మోపిన ఒబామా.. ఘనస్వాగతం పలికిన నరేంద్ర మోడీ

భారత్ లో కాలు మోపిన ఒబామా.. ఘనస్వాగతం పలికిన నరేంద్ర మోడీ
, ఆదివారం, 25 జనవరి 2015 (10:12 IST)
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా దంపతులు భారతదేశ రాజధాని ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో దిగారు. అనుకున్న షెడ్యూల్ కంటే 20 నిమిషాలు ముందుగా ఉదయం 9.40 గంటలకే అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఎయిర్ఫోర్స్ వన్ ఇక్కడ వాలిపోయింది. ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికేందుకు భారత అధికారులు సర్వ సన్నాహాలు చేశారు.
 
ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు పాలం ఎయిర్ పోర్టుకు వచ్చారు. ద బీస్ట్ వాహనాన్ని నేరుగా విమానం వద్దకు తీసుకొచ్చారు. ఆ వెంటే ఒబామా భద్రతాధికారుల వాహనం కూడా ఉంది. భారతదేశంలో మూడు రోజుల పర్యటన కోసం అమెరికా ప్రథమపౌరుడు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన అధికారక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu