Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

26/11 గాయాన్ని ఎన్నటికీ మరచిపోలేం : నరేంద్ర మోడీ

26/11 గాయాన్ని ఎన్నటికీ మరచిపోలేం : నరేంద్ర మోడీ
, బుధవారం, 26 నవంబరు 2014 (16:26 IST)
భారత్ వాణిజ్య రాజధాని ముంబైలో జరిగిన 26/11 దాడులను సార్క్ శిఖరాగ్ర సదస్సు వేదికగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తావించారు. 26/11 గాయాన్ని ఎన్నిటికీ మరిచిపోలేమన్నారు.
 
నేపాల్ రాజధాని ఖాట్మండూలో జరుగుతున్న సార్క్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముంబైపై 26/11 జరిగిన దాడులను భారత ప్రజల ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు. ఆ గాయం అంత సులువుగా మానిపోయేది కాదన్నారు. ప్రపంచ దేశాలన్నీ కలిపి ఉగ్రవాదాన్ని సమూలంగా నాశం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
 
దాడులు జరిగి నేటికి సరిగ్గా ఆరేళ్లు పూర్తయ్యాయని ఆయన గుర్తు చేశారు. 2008 ముంబై దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. సార్క్ దేశాలకు మూడు నుంచి ఐదేళ్ల వీసా, అలాగే భారత్‌కు వైద్య అవసరాల కోసం వచ్చేవారికి వెంటనే వీసా సౌకర్యం కల్పిస్తామని ఆయన వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu