Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్మృతి ఇరానీ రాష్ట్రపతి అవుతారు: రాజస్థాన్ జ్యోతిష్యుడు

స్మృతి ఇరానీ రాష్ట్రపతి అవుతారు: రాజస్థాన్ జ్యోతిష్యుడు
, సోమవారం, 24 నవంబరు 2014 (13:59 IST)
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ భవిష్యత్తులో రాష్ట్రపతి అవుతారని రాజస్థాన్‌లోని జ్యోతిష్యుడు చెప్పాడు.
 
ఒక నాటి బుల్లితెర నటి, నేటి కేంద్ర మానవవనరుల శాఖామంత్రి స్మృతి ఇరానీ రాష్ట్రపతి అవుతారని రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన ఓ జ్యోతిష్యుడు చెప్పిన భవిష్య వాణికి ఉబ్బితబ్బిబ్బైన స్మృతి ఇరానీ ఆయనకు కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారు. 
 
భర్తతో కలిసి ఆదివారం బిల్వారాలోని కరోయి గ్రామానికి వెళ్లిన స్మృతి ఇరానీకి అక్కడి జ్యోతిష్యుడు పండిట్ నాథులాల్ వ్యాస్ జ్యోతిష్యం చెప్పారు. రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందని గతంలో నాథలాల్, స్మృతి ఇరానీకి చెప్పారట. 
 
నాథులాల్ చెప్పినట్లుగానే స్మృతి ఇరానీ, మోడీ సర్కారులో కీలకమైన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఈ సారి నాధులాల్ చెప్పినట్లు స్మృతి ఇరానీ రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించడం ఖాయమేనన్న మాట. 
 
ఈ జ్యోతిష్యుడిని స్మృతి ఇరానీ కలవడంపై అనేక విమర్శలు రాగా, వాటిని ఆమె కొట్టిపారేశారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగతమని చెప్పుకొచ్చారు. కొందరికి కొన్నికొన్ని నమ్మకాలు ఉంటాయని, వాటి ప్రకారం నడుచుకుంటారన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu