భారత దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొన్నాళ్లుగా హైలెవల్ షుగర్, దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బెంగుళూరుకు వెళ్లి, ప్రకృతి వైద్య చికిత్స చేయించుకోనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన మార్చి ఐదో తేదిన బెంగళూరుకు వెళుతున్నారు.
కేజ్రీవాల్ అక్కడ పది రోజుల పాటు బస చేసి ప్రకృతి వైద్య చికిత్స పొందుతారని సమాచారం. ఆసక్తికరంగా ఆ మధ్య ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా నిరంతర దగ్గుతో ఇబ్బందిపడుతున్న కేజ్రీకి బెంగళూరులోని యోగా థెరపిస్ట్ ను కలవాలని సూచించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఉపముఖ్యమంత్రి మనీష్ శిశోడియా తాత్కాలిక సీఎంగా వ్యవహరించి ప్రభుత్వ కార్యకలాపాలు చూస్తారని సమాచారం.