కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నన్ను చూస్తే హడలి పోతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అందుకే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు ఉన్న అధికారాలపై కేంద్ర హోంశాఖ మునుపెన్నడూ లేని విధంగా గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసిందని ఆయన ఆరోపించారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలపై కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంపై కేజ్రీవాల్ శుక్రవారం స్పందించారు. అది వారి అభద్రతా భావానికి నిదర్శనమని, తనను చూసి కేంద్రం భయపడుతోందని వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం చేపట్టిన అవినీతి వ్యతిరేక పాలనపై భయం పట్టుకుందని అన్నారు.
'తొలుత ఢిల్లీ ఎన్నికల్లో ఓడిన బీజేపీ, ఇప్పుడు మా ప్రభుత్వానికి నోటీసులిచ్చి మరోసారి ఓడిపోయింది' అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. కాగా, ఈ నోటిఫికేషన్పై కేజ్రీవాల్ మరికాసేపట్లో ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరు నజీబ్ జంగ్, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మధ్య అంతరం మరింతగా పెరిగిపోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.