Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గొడ్డు మాంసంపై నఖ్వీ వ్యాఖ్యలు సరికాదు.. అసదుద్దీన్‌‌ కామెంట్స్ ఓకే : అరుణ్ జైట్లీ

గొడ్డు మాంసంపై నఖ్వీ వ్యాఖ్యలు సరికాదు.. అసదుద్దీన్‌‌ కామెంట్స్ ఓకే : అరుణ్ జైట్లీ
, శనివారం, 23 మే 2015 (13:29 IST)
గొడ్డు మాంసంపై కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. అదేసమయంలో ఐఎంఐ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్ధించారు.
 
గొడ్డు మాంసం తినాలనుకునే వారు పాకిస్థాన్ లేదా అరబ్ దేశాలకు వెళ్లిపోవాలని అబ్బాస్ నఖ్వీ వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. ఢిల్లీలో మోడీ ఏడాది పరిపాలనపై ప్రసంగించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం పట్ల ప్రజలకు బాధ్యత ఉందని, అది ఎవరూ గుర్తు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.
 
కాగా, నఖ్వీ వ్యాఖ్యానించిన సందర్భంగా అక్కడే ఉన్న అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, ఒకరి ఆహారపుటలవాట్లను మరొకరు తప్పు పట్టవద్దని, ఏం చేయాలో ప్రజలనే నిర్ణయించుకోనివ్వాలని సూచించారు. వీటిని మరో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సమర్ధిస్తూ.. నఖ్వీ వ్యాఖ్యలను ఖండించారు. కాగా, మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం పశు మాంసంపై నిషేధం విధించిన సందర్భంగా వివాదం రేగింది.

Share this Story:

Follow Webdunia telugu