Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శశికళ సీఎం కాగానే రామ్మోహన్ రావు మళ్లీ సీఎస్ అవుతారా?

తమిళనాడు సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం చేస్తారా? లేదా అన్న డైలమాలో ఉండగానే ఆమె పట్ల అసంతృప్తి వ్యక్తం చేసే వారి సంఖ్య పెరిగిపోతూ వుంది. తాజాగా తమిళనాడు సీఎంవో ఓఎస్డీ శాంతాషీలానాయర్ రాజీనామా చేశారు. వ్య

శశికళ సీఎం కాగానే రామ్మోహన్ రావు మళ్లీ సీఎస్ అవుతారా?
, మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (15:22 IST)
తమిళనాడు సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం చేస్తారా? లేదా అన్న డైలమాలో ఉండగానే ఆమె పట్ల అసంతృప్తి వ్యక్తం చేసే వారి సంఖ్య పెరిగిపోతూ వుంది. తాజాగా తమిళనాడు సీఎంవో ఓఎస్డీ శాంతాషీలానాయర్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
 
అవినీతి ఆరోపణలు ఎదుర్కొని, ఏసీబీ దాడుల్లో అడ్డంగా దొరికిపోయిన తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్‌రావు తిరిగి శశికళ సీఎం కాగానే పదవీ బాధ్యతలు చేపడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు అడిషనల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న శాంతా షీలానాయర్ ఐఏఎస్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. 
 
కానీ ఈమె రాజీనామా వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఏవైనా ఉన్నాయేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శశికళ కూడా తనకు అనుకూలంగా లేని అధికారులను బదిలీ చేయాలని భావిస్తోన్న తరుణంలో అమ్మకు విధేయులైన వారు వారికైవారుగా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కైలాష్ సత్యార్ధి ఇంట్లో చోరీ.. నోబెల్ ప్రైజ్ సేఫ్...