Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హమ్మయ్య! నాగాలాండ్‌లో తెలుగు ఇంజినీర్లను వదిలిపెట్టిన కిడ్నాపర్లు!

హమ్మయ్య! నాగాలాండ్‌లో తెలుగు ఇంజినీర్లను వదిలిపెట్టిన కిడ్నాపర్లు!
, మంగళవారం, 29 జులై 2014 (18:02 IST)
హమ్మయ్య.. అపహరణకు గురైన విజయవాడకు చెందిన ఇద్దరు ఇంజినీర్లకు కిడ్నాపర్ల చెర నుంచి విముక్తి లభించింది. తాము విడుదలైనట్లు బంధువులకు వారే సమాచారం అందించారు. రత్న కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలో పని చేస్తున్న గోగినేని ప్రకాష్, చంద్ర, రఘు రెండు రోజుల కిందట నాగ్ లాండ్‌లోని దిమ్మాపూర్‌లో కిడ్నాపునకు గురైనట్లు మంగళవారం వెలుగులోకి వచ్చింది. దాంతో, కిడ్నాపర్లతో కంపెనీ ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కొద్ది గంటల్లోపు వారు సురక్షిత ప్రాంతానికి చేరుకోనున్నారని సమాచారం.
 
కాగా, సొంత రాష్ట్రానికి వచ్చేందుకు స్థానిక రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఈ ముగ్గురిని బోడో తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. మంగళవారం కిడ్నాప్ విషయాన్ని బాధితులు పని చేస్తున్న కంపెనీ ప్రతినిధులు వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. గతంలో కూడా పలువురు తెలుగువారిని తీవ్రవాదులు కిడ్నాప్ చేసి ఆ తర్వాత వదిలిపెట్టారు. నాగమల్లేశ్వర రావు అనే తెలుగు టెక్కీ జూన్ 17న అపహరణకు గురైన సంగతి తెలిసిందే. ఏపికి చెందిన ఇంజనీర్ బండ్లమూడి నాగ మల్లేశ్వరరావు (36)ను విడిచిపెట్టాలంటే రూ.6 కోట్లు చెల్లించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేసినట్లుగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu