Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్ లో పెట్టుబడులు పెరిగాయి : నరేంద్ర మోదీ

భారత్ లో పెట్టుబడులు పెరిగాయి : నరేంద్ర మోదీ
, మంగళవారం, 27 జనవరి 2015 (06:27 IST)
భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని మోదీ అన్నారు. అందుకు పరిష్కార దిశగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీఅన్నారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన భారత్-అమెరికా వాణిజ్య వేత్తల సదస్సులో మోదీ ప్రసంగించారు. అందులో భాగంగానే తాను అమెరికాలో పర్యటించిన తర్వాత భారత్లో పెట్టుబడులు పెరిగాయని చెప్పారు. పెట్టుబడులు పెరగడం వల్ల భారత ఆర్థిక రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. 
 
భారత్లో అన్ని ప్రాజెక్టులపై పీఎంవో నిఘా ఉంటుందని అన్నారు. తమ హయాంలో ద్రవ్యోల్బణం కనిష్ఠ స్థాయికి దిగి వచ్చిందని మోదీ అన్నారు. మరింత పటిష్ట చేయడానికి కృషి జరుగుతోందని ఆయన చెప్పారు.  మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు.  

Share this Story:

Follow Webdunia telugu