Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వ్యభిచారం కేసులో ఇరికించేందుకు నా భర్త కుట్ర : నటి రాధ సంచలన ఆరోపణలు

తనను వ్యభిచారం కేసులో ఇరికించేందుకు నా భర్త కుట్ర పన్నుతున్నాడంటూ 'సుందరా ట్రావెల్స్‌'లో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైన నటి రాధ సంచలన ఆరోపణలు చేశారు.

వ్యభిచారం కేసులో ఇరికించేందుకు నా భర్త కుట్ర : నటి రాధ సంచలన ఆరోపణలు
, బుధవారం, 24 ఆగస్టు 2016 (10:12 IST)
తనను వ్యభిచారం కేసులో ఇరికించేందుకు నా భర్త కుట్ర పన్నుతున్నాడంటూ 'సుందరా ట్రావెల్స్‌'లో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైన నటి రాధ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే పలు మార్లు వివాదాలతో వార్తల్లోకెక్కిన ఈమె ఇటీవల మరోసారి వార్తల్లోకెక్కి కలకలం సృష్టిస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
'సుందరా ట్రావెల్' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన నటి రాధ. తాను నాలుగు చిత్రాల్లో నటించానని తెలిపారు. ఆ సమయంలో శ్యామ్ అలియాస్ పైసల్ అనే వ్యక్తితో పరిచయమైందని, అది ప్రేమగా మారడంతో 2008 నుంచి పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నామని తెలిపారు. అయితే శ్యామ్‌కు పలువురు అమ్మాయిలలో సంబంధం ఉందని తెలియడంతో తాను ఆయన నుంచి విడిపోయానని వివరించారు. 
 
అయితే, కాగా తన తల్లి సైదాపేటకు చెందిన సతీష్ అనే వ్యక్తికి రూ.5 లక్షలు అప్పు ఇచ్చారని, అతను ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదని చెప్పారు. తాను వెళ్లి అడగ్గా సరిగా సమాధానం చెప్పకుండా దుర్భాషలాడాడని తెలిపారు. దీంతో అతని నుంచి తన డబ్బు తిరిగి ఇప్పించేలా చేయమని తన మాజీ భర్తను కోరానన్నారు. కానీ, అన్నాడీఎంకేకు చెందిన కోడంబాక్కం డివిజన్ ఉపకార్యదర్శి మునివేల్ ఉన్నారని తెలిపారు. ఆయన తనతో అక్రమ సంబంధం ఉందని పేర్కొంటూ వ్యభిచారం కేసులో అరెస్టు చేయించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నై టెక్కీపై అత్యాచారం.. హత్య : ముగ్గురికి జీవితశిక్ష ఖరారు