Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాఫియా డాన్‌తో వేదిక పంచుకున్న అమిత్ షా.. కొత్త వివాదం!

మాఫియా డాన్‌తో వేదిక పంచుకున్న అమిత్ షా.. కొత్త వివాదం!
, బుధవారం, 1 అక్టోబరు 2014 (17:01 IST)
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం హర్యానాలో మాఫియా డాన్‌తో వేదికను పంచుకుని కొత్త వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచారు. నితిశ్ కటారా, జెస్సికా లాల్ హత్య కేసులో నిందితుడిగా తేలిన వికాస్ యాదవ్ తండ్రి, మాఫియా డాన్ డీపీ యాదవ్‌తో కలిసి హర్యానాలో ఓ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డీపీ యాదవ్‌కు ముందు ముందు మంచి రోజులున్నాయన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై నితిశ్ కటారా తల్లి నీలం కటారా ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు. 
 
‘డీపీ యాదవ్‌కు మంచి రోజులుంటే, మరి మిగిలిన వారి పరిస్థితి ఏమిటి?’ అంటూ ఆమె అమిత్ షాను నిలదీశారు. 2004లోనూ డీపీ యాదవ్‌కు బీజేపీ సభ్యత్వమిచ్చింది. అయితే, నితిశ్ కటారా హత్యోదంతం నేపథ్యంలో ఆరోపణల వెల్లువ కారణంగా నాలుగు రోజుల్లోనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని అతన్ని పార్టీ నుంచి బహిష్కరించింది.

Share this Story:

Follow Webdunia telugu