Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూపీలో అరాచకాల పర్వం: కేసు పెట్టిందని రేప్.. వాపస్ తీసుకోకపోతే?

యూపీలో అరాచకాల పర్వం: కేసు పెట్టిందని రేప్.. వాపస్ తీసుకోకపోతే?
, మంగళవారం, 25 ఆగస్టు 2015 (15:58 IST)
ఉత్తరప్రదేశ్‌లో అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు పెట్టిన పాపానికి ఆ మహిళపై రెండోసారి రేప్ జరిగింది. ఈ ఘటన యూపీ ముజఫర్ నగర్ జిల్లా కుర్వావాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే... పూగానా స్టేషన్ పరిధిలోని కుర్వావా గ్రామంలో ఆగస్టు 21న అంకుర్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి అతడి అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన నిందితుడు నా మీదే కేసు పెడతావా అంటూ మరోసారి ఒంటరిగా దొరికేసరికి 'అత్యాచారం కేసు వాపస్ తీసుకోవాలని, లేని పక్షంలో మళ్లీ రేప్ చేస్తా'నని బెదిరించాడు. ఈ విషయాన్ని యువతి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పరారీలో ఉన్న అంకుర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu