Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళనాడులో దారుణం: కోరిక తీర్చలేదని ప్రియురాలి హత్య!

తమిళనాడులో దారుణం: కోరిక తీర్చలేదని ప్రియురాలి హత్య!
, బుధవారం, 23 జులై 2014 (11:06 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. తన కోరిక తీర్చలేదని ఆగ్రహానికి గురైన ఓ యువకుడు తన ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం.. తిరువళ్లూరు జిల్లాలోని పూండి యూనియన్ పరిధిలోని నైవేలి గ్రామానికి చెందిన కుప్పన్ కుమార్తె చాముండేశ్వరి(19), అదే గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. 
 
అయితే చాముండేశ్వరి మనవాలనగర్ ప్రాంతానికి చెందిన మరో యువకుడితో ప్రేమలో పడి రాజ్‌కుమార్‌ను దూరంగా ఉంచింది. ఈ నేపథ్యంలో చాముండేశ్వరిపై కోపం పెంచుకున్న రాజ్ కుమార్.. చివరిసారిగా ఒకసారి మాట్లాడాలని ఆమెను కోరాడు. దీంతో తన ఇంటి సమీపంలోకి వచ్చిన రాజ్ కుమార్‌ను ఆ యువతి కలిసింది. తన కోరికను తీర్చాలని నిందితుడు ఆమెను బలవంత పెట్టాడు. అందుకు అంగీకరించకపోవడంతో చాముండేశ్వరి తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ విషయాలన్నింటినీ పోలీసుల విచారణలో నిందితుడు రాజ్‌కుమార్ వెల్లడించాడు.

Share this Story:

Follow Webdunia telugu