ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్కు పిలుపునిచ్చిన నేపధ్యంలో పిల్లలు నుంచి పెద్దల వరకూ మంచి స్పందన లభిస్తోంది. నరేంద్ర మోడీ గురువారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంలో అందరూ స్వచ్చ భారత్లో పాల్గొనాలని ప్రజలనుద్దేశించి విజ్ఞప్తి చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ కల అయిన క్లీన్ ఇండియాను 2019 నాటికి సాకారం చేయాలని కోరారు.
ఇంటికి ఆటోలో వెళ్లే ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో అరుణ గ్రహానికి వెళ్లగలిగామనీ, అలాంటిది మన దేశాన్ని మనం క్లీన్ గా ఉంచుకోలేమా అంటూ ప్రశ్నించారు. మోడీ పిలుపుకు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ అందరూ పాల్గొంటున్నారు. సినీ నటులు అమీర్, ప్రియాంక ఇప్పటికే తాము సిద్ధమని ట్వీట్ చేశారు.